Website with Designing 399/- Rs Only. Media5 Contact 95050 71110

ఒకసారి స్వామి రాంతీర్థ జపాన్‌లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్‌లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్‌లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు “ఎందుకంత కష్టం తీసుకొన్నావు?” అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.”స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు” అన్నాడు.

ఒకరోజు వివేకానందులు ఏ విధమైన సమాచారం లేకుండా అమెరికా నుండి ఈజిప్ట్ ద్వారా బొంబాయికి ఓడలో వచ్చాడు.అక్కడి నుండి కలకత్తాకు రైలులో వచ్చాడు.స్వామీ వివేకానందులు అప్పుడు బ్రిటిష్ దుస్తులు ధరించి ఉన్నాడు.కలకత్తాలోని మఠం దగ్గరికి వెళ్ళి గోడ దూకి లోనికి వెళ్ళాడు.అప్పుడు మఠం లోని స్వాములు భోజనం చేయు సమయం.దూరం నుండి బ్రిటిష్ దుస్తులలో ఉన్న వివేకానందులను వారు గుర్తించలేక భయపడి స్వామి వివేకానందుల వద్దకు కర్రలతో పరుగెత్తుకొచ్చారు.దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తించి సంతోషం పట్టలేకపోయి మఠం అంతా చాటింపు వేశారు.తోటి స్వాములతో వివేకానందులు ” మళ్ళీ ఆలస్యం ఐతే భోజనపదార్థాలు అయిపోతాయని గోడ దూకి వచ్చాను”అని అన్నాడు.అంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం అలసట లేక హాస్యాన్ని పండించడం చూసి ఆ స్వాములు ఆనందించారు.

గతాన్ని దేవుడు కుడా మార్చలేడు


మనం చదవడమే నేర్చుకున్నాం కాని ఆలోచించడానికి శిక్షణను పొందలేదు.

నేరాలలో సర్వ సామాన్యమైనది కాలాన్ని వృధా చేయడం.

వంద ఉద్బోదల కన్నా ఒక అనుభవం గొప్పది

తనను తాను మలచుకొని సర్దుకు పోగాలగినవాడే ఈ ప్రపంచములో బ్రతకటం తెలిసినవాడు

నీవు ఎంతగా ఉహిస్తూ ఉంటావో అంతగా విశ్రాంతి కి దూరం అవుతావు

ఒక వ్యక్తి సంతోషముగా వుంటే తప్ప ఇతరులకు సంతోషం కలిగించలేడు .

మనం ముందుకే నడవాలి. ఎన్నో సార్లు, దారిలో నిరాశ ఆవహిస్తుంది. కాని చివరకు, దప్పికతో ఉన్న బాటసారి నీటిని కనుగొంటాడు. నిజానికి దప్పిక కంటే ముందే నీరు అక్కడ ఉంది.

ఇబ్బందులు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి, మన ఆలోచనలకు పదునుపెడతాయి. -

అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో... మనిషిలో... రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.

నూతిలోని కప్పలా ఉండకూడదు. మతోన్మాదులంతా అలాంటి వారే. వారు తమ మతమే గొప్పదనుకుంటారు. కానీ, తక్కిన మతాలలోని మంచిని చూడరు.- రామకృష్ణ పరమహంస

నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు
వెంకయ్య తాత

ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.-

నిన్ను నిన్నుగా వదిలేస్తే నువ్వు నీలోని శక్తులని గుర్తించగలుగుతావు
- ధీరూభాయి అంబానీ

బంగారాన్ని గాని, గంధాన్ని గాని ఏం చేసినా వాటి గుణం మారుదు. అదే విధంగా ఉత్తముడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతని ఉత్తమ గుణం మారుదు.



జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.

ఈ లోకంలో ప్రతి మనిషీ పూర్ణానందాన్ని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని కేవలం సత్కార్యం ద్వారానే మానవుడు పొందగలడు. ...


ఇసుమంత ఆచరణ ఇరవై వేల టన్నుల మాటలతో సమానము.
వివేకానంద

తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.